Home > తెలంగాణ > 20 ఏళ్లుగా ఉన్న సెంటిమెంట్ ఇంటిని ఖాళీ చేస్తున్న కేసీఆర్

20 ఏళ్లుగా ఉన్న సెంటిమెంట్ ఇంటిని ఖాళీ చేస్తున్న కేసీఆర్

20 ఏళ్లుగా ఉన్న సెంటిమెంట్ ఇంటిని ఖాళీ చేస్తున్న కేసీఆర్
X

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 20 ఏళ్లుగా ఉన్న సెంటిమెంట్ ఇంటిని ఖాళీ చేయనున్నారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు 23లో ఉన్న తన అధికారిక నివాసంతో ఉన్న కేసీఆర్ 20 ఏళ్ల అనుబంధం తెగిపోనుంది. 2004లో బీఆర్ఎస్ తరుపున కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్.. మన్మోహన్ సింగ్ కేబీనెట్ లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉన్న ఆయనకు.. తుగ్లక్ రోడ్డులో ఉన్న ఆ ఇంటిని (క్వార్టర్స్) అప్పటి ప్రభుత్వం కేటాయించింది. 2006లో కేంద్రమంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసినా.. బై ఎలక్షన్స్ లో గెలిచిన కేసీఆర్.. ఆ తర్వాత కూడా అదే క్వార్టర్స్ లో కొనసాగారు.

2009లో మహబూబ్ నగర్ ఎంపీగా, 2014లో తెలంగాణ సీఎంగా గెలిచిన తర్వాత కూడా కేసీఆర్ ఆ నివాసంలోనే ఉన్నారు. కేసీఆర్ కుమార్తే కవిత నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత కూడా అదే ఇంటిని కొనసాగిస్తూ వస్తున్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెళ్లిన ప్రతీసారి అక్కడే బస చేసేవారు. 2018లో రెండోసారి సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత కూడా అదే ఇంటిని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సీఎంగా రాజీనామా చేయగా.. ఢిల్లీలోని తన క్వార్టర్స్ ను ఖాళీ చేయడానికి రెండు రోజుల గడువు కావాలని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఢిల్లీ అధికారులకు కోరారు

Updated : 5 Dec 2023 10:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top