Home > తెలంగాణ > కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే - బండి సంజయ్

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే - బండి సంజయ్

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే - బండి సంజయ్
X

ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కైన కేసీఆర్ దక్షిణ తెలంగాణకు ద్రోహం చేశాడని బండి సంజయ్ ఆరోపించారు. ఆయన కారణంగానే ప్రస్తుతం నాగార్జునసాగర్ లో చుక్కనీరు లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే చాలు అన్ని అబద్దాలే చెబుతారని విమర్శించారు. ప్రధాని మోదీ రామగుండంలో వాస్తవాలు చెప్పాగానే సింగరేణి ప్రైవేటీకరణపై కేసీఆర్ వెనక్కి తగ్గారని అన్నారు. కేంద్రం మోటర్లకు మీటర్లు ఎక్కడ పెట్టిందో బీఆర్ఎస్ నేతలు చూపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కేసీఆర్ చెప్తున్న మాటలు నమ్మి రైతులు మరోసారి మోసపోవద్దని బండి సూచించారు. ఎన్నికలు అయిపోయాక సీఎం కేసీఆర్ రైతుబంధు బంద్ చేస్తారని చెప్పారు. కృష్ణా జలాల వివాద పరిష్కారం కోసం మోడీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తే కనీసం థాంక్స్ చెప్పని మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు. కేంద్రం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటంతో తన బండారం బయట పడుతోందని కేసీఆర్ భయపడుతున్నాడని అన్నారు.

దక్షిణ తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ నట్టేట ముంచాడని బండి సంజయ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన ఉచిత యూరియా హామీ ఎటు పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులకు న్యాయం చేసింది కేంద్రమేనన్న సంజయ్.. రానున్న ఎన్నికలలో బీజేపీకి ఓటు వేసి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని కోరారు.


Updated : 14 Oct 2023 10:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top