Home > తెలంగాణ > సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్

సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్

సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ ముఖ్యమంత్రి అయి ఉండి కూడా మాట్లాడే భాష అదేనా అని ప్రశ్నించారు. తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడూ అలాంటి పరుషపదాలు ఉపయోగించలేదన్నారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన కదనభేరి బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ పోరాటాల గడ్డ అని అన్నారు. అటువంటి గడ్డ నుంచే తాను పోరాటం ప్రారంభించానని గుర్తు చేశారు. అప్పట్లో తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడొద్దనే ఆంక్షలు ఉండేవన్నారు.

తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ తెలంగాణ కోసం పోరాడానని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుబంధు అడిగితే ఓ మంత్రి చెప్పుతో కొట్టమని చెబుతాడని, నీళ్లు, విద్యుత్ గురించి అడిగితే సీఎం అయి ఉండి పండబెట్టి తొక్కుతా, మానవ బాంబును అవుతా అని అసహం ప్రదర్శిస్తున్నారని, ముఖ్యమంత్రి అయి ఉండి మాట్లాడే భాష అదేనా? అని ప్రశ్నించారు.

సీఎం అయిన వ్యక్తి మానవబాంబులం అవుతామని అనొచ్చునా? అని సీఎం రేవంత్‌ను కేసీఆర్ నిలదీశారు. తమ ప్రభుత్వంలో 24 గంటలు విద్యుత్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. జిల్లాకో నవోదయ పాఠశాలను ఇవ్వనటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఉద్యమ సమయం నుంచి తన వెంటే నిలుస్తున్న వినోద్ కుమార్‌పై ప్రశంసలు కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీపై చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాగా ఓటు వేయొద్దని, ఈసారి చూసుకుని బీఆర్ఎస్‌కే ఓటు వేయాలని ప్రజలను కోరారు. భూమి, ఆకాశం ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందన్నారు.


Updated : 12 March 2024 3:15 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top