Home > తెలంగాణ > కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది

కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది

కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది
X

కేసీఆర్ మాటలు నమ్మి రెండుసార్లు మోసపోయిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు అవకాశమివ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నందునే కీలక నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు. మొన్న రాజగోపాల్ రెడ్డి, నేడు వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బరిలో దిగుతున్నారని వెంకట్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ గతంలో పార్టీలకు అతీతంగా 300 ఇందిరమ్మ ఇండ్లు కట్టించామని వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పదేండ్లలో ఆలేరులో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు దళిత బంధు, బీసీ బంధు పథకాలు తెరపైకి తెస్తున్న కేసీఆర్.. తమ పార్టీ వారికే వాటిని ఇస్తున్నారని ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రెండు సార్లు వాయిదా పడి 30లక్షల మంది అభ్యర్థులు బాధకు ప్రభుత్వమే కారణమని వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఇన్నేండ్లలో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడం కూడా ప్రభుత్వానికి చేతకావడంలేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందని ఇందుకు సాక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటేనని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెడితే ఆలేరు ప్రాజెక్టు పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ఎవరు కష్టంలో ఉన్నా అక్కడికి వెళ్లి సాయం చేస్తున్నాని, ఇకపైనా అందరికీ అండగా ఉంటానని చెప్పారు. బీఆర్ఎస్ ఇచ్చే పైసలు తీస్కొని కాంగ్రెస్ కు ఓటేయాలని వెంకట్ రెడ్డి చెప్పారు హస్తానికి ఓటు వెసి ఆరు గ్యారంటీలను తీసుకోండని పిలుపునిచ్చారు.


Updated : 1 Nov 2023 12:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top