Home > తెలంగాణ > బీఆర్ఎస్‌తో పొత్తుపై కొండ విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌తో పొత్తుపై కొండ విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌తో పొత్తుపై కొండ విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పొత్తుపై బిజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లను బీజేపీ దగ్గరకు కూడా రానివ్వదని అన్నారు. బీఆర్ఎస్‌ నుంచి భారీగా బీజేపీలోకి చేరికలు జరిగాయి. విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, సీనియర్ లీడర్లు భారీగా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రధాని మోడీకి ప్రజల మద్దతు లభిస్తోందని అన్నారు. తాను చేవెళ్ల ప్రజలకోసమే పనిచేస్తున్నానని.. ఇక్కడే ఉంటానని చెప్పారు. ప్రధాని మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 లకు పైచిలుకు స్థానాల్లో బీజేపీ ఈ సారి జెండా పాతబోతోందని తెలిపారు.మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో గెలుపొందిన బీజేపీ.. అదే జోరును లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్‌తో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. ఫిబ్రవరి చివరివారంలోపు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ స్థానాలు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే చేవెళ్ల నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ అధిష్టానానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంకేతాలు పంపారు.

Updated : 16 Feb 2024 4:32 PM GMT
Tags:    
Next Story
Share it
Top