Home > తెలంగాణ > కొత్తగూడెంలో సీపీఐకి గట్టి షాక్.. పార్టీని వీడిన..

కొత్తగూడెంలో సీపీఐకి గట్టి షాక్.. పార్టీని వీడిన..

కొత్తగూడెంలో సీపీఐకి గట్టి షాక్.. పార్టీని వీడిన..
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐకి గట్టి షాక్ తగలింది. కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. వారంతా సీపీఐ పార్టీని వీడిన మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మున్సిపల్‌ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు బోయిన విజయ్ కుమార్, సత్యనారాయణ చారి, మాచర్ల రాజకుమారి, నేరేళ్ల సమైక్య బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కొత్తగూడెం సీపీఐ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నామినేషన్ వేసిన రోజే వీరింతా పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీపీఐ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ సీపీఐకి కొత్తగూడెం అసెంబ్లీ సీటుతో పాటు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఆయన నామినేషన్ వేసిన రోజే సీపీఐకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు పార్టీని వీడడం గమనార్హం.


Updated : 8 Nov 2023 3:23 PM GMT
Tags:    
Next Story
Share it
Top