Home > తెలంగాణ > నీటి విడుదలను తక్షణమే ఆపండి.. ఏపీ సర్కార్కు కేఆర్ఎంబీ ఆదేశాలు

నీటి విడుదలను తక్షణమే ఆపండి.. ఏపీ సర్కార్కు కేఆర్ఎంబీ ఆదేశాలు

నీటి విడుదలను తక్షణమే ఆపండి.. ఏపీ సర్కార్కు కేఆర్ఎంబీ ఆదేశాలు
X

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు స్పందించిది. సాగర్ కుడికాల్వ నుంచి నీరు తీసుకోవడం వెంటనే ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి కేఆర్‌ఎంబీ కార్యదర్శి లేఖ రాశారు. ఏపీకి 3 విడతల్లో నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. అక్టోబర్‌ కోసం అడిగిన 5 టీఎంసీల్లో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు చెప్పింది. 2024 జనవరి, ఏప్రిల్‌లో నీరు విడుదల చేయాల్సి ఉందని తెలిపిన బోర్డు.. ముందు అడగకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది.

కాగా నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. డ్యామ్‌ 13వ గేట్‌ వరకు ఆక్రమించుకున్న ఆంధ్రా పోలీసులు కుడి కాలువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల్వ 522 అడుగులకు చేరింది. నీటి విడుదల ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు త్వరలోనే డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకుంది. మరో 12 అడుగుల మేర నీటిని విడుదల చేస్తే డెడ్‌ స్టోరేజీకి పడిపోనుంది.

ఇదిలా ఉంటే డ్యామ్‌కు ఇరువైపులా రెండు రాష్ట్రాలు భారీగా పోలీసులను మోహరించాయి. ప్రస్తుతం డ్యామ్ వద్ద దాదాపు 1400 మంది ఏపీ పోలీసులు ఉన్నారు. వారు 13వ గేట్‌ వరకు డ్యామ్‌ తమదని వాదిస్తూ అక్కడ ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డును మూసివేశారు. దీంతో డ్యామ్‌పై విధులు నిర్వహించే సిబ్బంది 13వ గేట్‌ దాటి అటువైపు ఉన్న తెలంగాణ కంట్రోల్‌ రూమ్‌ వైపు వెళ్లలేకపోతున్నారు. మరోవైపు నాగార్జున సాగర్‌ నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని విడుదల చేసుకోవడంపై తెలంగాణ అధికారులు కృష్ణా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయగా.. బోర్డు పైవిధంగా స్పందించింది.


Updated : 1 Dec 2023 12:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top