Home > తెలంగాణ > ట్రాఫిక్ కష్టాలకు చెక్..స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన కేటీఆర్

ట్రాఫిక్ కష్టాలకు చెక్..స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన కేటీఆర్

ట్రాఫిక్ కష్టాలకు చెక్..స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన కేటీఆర్
X

భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ నగరంలో నూతన బ్రిడ్జ్‎లను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‎లో ఇవాళ మరో బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్‌ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిరు. 2.25 కిలోమీటర్ల పొడవున్న, దక్షిణాదిలోనే అతి పెద్దదైన ఈ స్టీల్ బ్రిడ్జ్‎కు కార్మిక నాయకుడు ఎక్స్ మినిస్టర్ మంత్రి నాయిని నరసింహ రెడ్డి గౌరవార్థం ఆయన పేరును పెట్టారు. వంతెన నిర్మాణానికి దాదాపు 450కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.

ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.." స్టీల్ బ్రిడ్జిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాం. హైదరాబాద్‎ను విశ్వనగరంగా మార్చేందుకు పునాది వేశాం. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం. కాంగ్రెస్ , బీజేపీకి అధికారం ఇచ్చినా అభివృద్ధి చేయలేదు. ప్రతిపక్షాలు చూపించే సినిమా 2023లోనే ఉంది". అని మంత్రి అన్నారు.

ఈ స్టీల్ బ్రిడ్జ్‎తో వీఎస్‌టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ మార్గంలో నిత్యం లక్షలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. నిజానికి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా ఓయూ, నల్లకుంట వెళ్లాలంటే ఎంతలేదన్నా 30 నుంచి 40 నిమిషాల టైం పడుతుంది. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో పాటు ఈ జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో నూతనంగా నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీకి 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. అంటే దాదాపు 25 నిమిషాలు ఆదా కానుంది. దీనిపై వాహనాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Good Morning Friends 😍❤️

Updated : 19 Aug 2023 7:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top