Home > తెలంగాణ > అది డిక్లరేషన్ సభ కాదు... కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ.. మంత్రి కేటీఆర్ ట్వీట్

అది డిక్లరేషన్ సభ కాదు... కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ.. మంత్రి కేటీఆర్ ట్వీట్

అది డిక్లరేషన్ సభ కాదు... కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ.. మంత్రి కేటీఆర్ ట్వీట్
X

చేవెళ్ల ప్రజాగర్జన సభలోకాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేటీఆర్‌ కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ సభపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. అసలు అది డిక్లరేషన్ సభేకాదని... కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ అని ఫైరయ్యారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో.. విజన్‌ లేని కాంగ్రెస్‌ ఇచ్చిన డజను హామీలు గాల్లో దీపాలేన‌నే విష‌యం... చైతన్యవంతులైన తెలంగాణ ప్ర‌జ‌లకు తెలుస‌ని అన్నారు. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీల, ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే అందుకు ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ అంటూ విరుచుకుపడ్డారు.

మంత్రి ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘అది డిక్లరేషన్ సభ కాదు...అధికారం రానే రాదనే... కాంగ్రెస్ ఫస్ట్రేషన్ సభ. కర్ణాటకలో కనీసం రేషన్.. ఇవ్వలేని కాంగ్రెస్. తెలంగాణకొచ్చి డిక్లరేషన్.. ఇస్తే నమ్మేదెవరు ?. గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు. మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిది. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు తెలుసు.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట.. విజన్ లేని కాంగ్రెస్.. డజన్ హామీలు.. గాలీలో దీపాలే. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీలు, ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే దానికి కారణం, ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ. దళిత, గిరిజన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా వెంటాడుతూనే ఉంటుంది. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే ఎబిలిటీ లేదు. ప్రజల్లోక్రెడిబిలిటీ లేదు. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశానికే ఓ పరిపాలనా పాఠం. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీ మీది. ఇవ్వని హామీలెన్నో అమలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది. తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే’’ అంటూ ట్వీట్ చేశారు.

Updated : 28 Aug 2023 7:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top