అసెంబ్లీ ఎలక్షన్స్ అక్టోబర్లో లేనట్లే: కేటీఆర్
Bharath | 12 Sep 2023 10:03 AM GMT
X
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని లేవనెత్తిన బీజేపీ.. దాన్నే అనుసరిస్తుందని అన్నారు. సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనుండగా.. ఆ సమావేశాల్లో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు కేటీఆర్. జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున.. ఏప్రిల్, మే నెలలో తెలంగాణలో అసెంబ్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని లేదంటే ఎన్నికలు తప్పక పోస్ట్ పోన్ అవుతాయని అన్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అక్టోబర్లో ఎన్నికల నోటీఫికేషన్ అనుమానమేనన్నారు కేటీఆర్.
Updated : 12 Sep 2023 11:06 AM GMT
Tags: telangana hyderabad brs ktr cm kcr TS Assembly elections ts politics jamili elections one nation one elections bjp pm modi parliment meeting
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire