Home > తెలంగాణ > Lasya Nandita: మరణవార్త విని సొమ్మసిల్లిన ఎమ్మెల్యే లాస్య తల్లి

Lasya Nandita: మరణవార్త విని సొమ్మసిల్లిన ఎమ్మెల్యే లాస్య తల్లి

Lasya Nandita: మరణవార్త విని సొమ్మసిల్లిన ఎమ్మెల్యే లాస్య తల్లి
X

హైదరాబాద్ ఓఆర్ఆర్ కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా పదవిని చేపట్టి ఏడాది కూడా కాకమునుపే కన్నుమూశారు. లాస్య మరణవార్త విన్న ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆమె మరణ వార్త విని లాస్య తల్లి, సోదరి ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. కూతురు మరణాన్ని తట్టుకోలేక లాస్య తల్లి స్పృహతప్పి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. లాస్య మరణవార్త తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన 60 రోజుల్లోనే లాస్య నందిత వరుసగా ప్రమాదాలకు గురి కావడం.. తండ్రి చనిపోయిన ఏడాదిలోనే ఆమె కూడా మృతి చెందడంతో లాస్య కుటుంబంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. మరోవైపు లాస్య మృతదేహాన్ని పటాన్ చెరు నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి దేహానికి పోస్ట్ మార్టం చేయనున్నారు. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి లాస్య ఇంటికి వెళ్లనున్నారు.

ఇటీవల వరుస ప్రమాదాలనుంచి బయటపడిన లాస్య.. సదాశివపేట వెళ్లి వస్తుండగా.. ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. ముందు కారు తప్పించబోయి రెయిలింగ్ కు కారు ఢీకొనడంతో లాస్య అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రగాయాలయ్యాయి. 2023 ఫిబ్రవరి 19న లాస్య నందిత తండ్రి.. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గుండెపోటుతో మృతిచెందారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్య నందిత ఎన్నికయ్యారు. తండ్రి మరణించని ఏడాదిలో లోపు లాస్య నందిత మృతిచెందడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.

Updated : 23 Feb 2024 4:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top