బీజేపీతో టచ్లో కాంగ్రెస్ నేతలు! అంతర్గత విభేదాలే కారణం
Mic Tv Desk | 5 July 2023 4:52 AM GMT
X
X
దేశంలో బీజేపీకి ఒక చోట బలం కోల్పోతుంటే.. మరో చోట బలం పెరుగుతోంది. అంతర్గత మనస్పర్దలు పార్టీ గ్రాఫ్ ను కిందికి దించుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయ పార్టీల్లో కూడా అంతర్గత చీలికలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే శివసేన, ఎన్ఎస్పీలో వేర్వేరు వర్గాలుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పట్టినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర కాంగ్సెస్ లోని కొందరు నేతలు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారట. ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ మంత్రి సుధీర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
మంగళవారం (జులై 4) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు తమతో టచ్ ఉన్నారని తెలిపారు. త్వరలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని అన్నారు. సుధీర్ వ్యాఖ్యలతో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. రెండుగా విడిపోతుందనే చర్చ మొదలయ్యాయి.
Updated : 5 July 2023 4:53 AM GMT
Tags: maharastra bjp congress bjp minister sudheer latest news telugu news congress leaders join bjp
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire