Home > తెలంగాణ > డిప్యూటీ సీఎంతో చిరంజీవి భేటీ.. కశ్మీర్ శాలువాతో..

డిప్యూటీ సీఎంతో చిరంజీవి భేటీ.. కశ్మీర్ శాలువాతో..

డిప్యూటీ సీఎంతో చిరంజీవి భేటీ.. కశ్మీర్ శాలువాతో..
X

మెగాస్టార్ చిరంజీవి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. తన సతీమణి సురేఖతో కలిసి ప్రజాభవన్ వెళ్లిన చిరు.. భట్టితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్ నుంచి తెప్పించిన ప్రత్యేక శాలువాతో భట్టిని చిరు సన్మానించారు. డిప్యూటీ సీఎంగా నియమితులైనందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా భట్టి సైతం చిరును శాలువాతో సత్కరించారు. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని చిరు కలిశారు. సీఎంగా ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. అటు నాగార్జున దంపతులు, బాలకృష్ణ సైతం రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ తెలిపారు.


Updated : 4 Jan 2024 4:31 PM GMT
Tags:    
Next Story
Share it
Top