Home > తెలంగాణ > అసెంబ్లీ సమావేశాలపై భట్టి విక్రమార్క కామెంట్స్.. హరీశ్ రావు స్ట్రాంగ్ రిప్లై

అసెంబ్లీ సమావేశాలపై భట్టి విక్రమార్క కామెంట్స్.. హరీశ్ రావు స్ట్రాంగ్ రిప్లై

అసెంబ్లీ సమావేశాలపై భట్టి విక్రమార్క కామెంట్స్.. హరీశ్ రావు స్ట్రాంగ్ రిప్లై
X

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు జరగనున్నాయి. గురువారం(ఆగష్టు 3న) స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సలహా సంఘం (BAC) సమావేశంలో మూడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై సభ్యులు చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీలు పాల్గొన్నారు.





అయితే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, అన్నింటినీ చర్చించేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. దేశంలోనే అతి తక్కువ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. దీనికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సినిమా స్టైల్ లో సమాధానమిచ్చారు. ఎన్ని రోజులు నిర్వహించారన్నది ముఖ్యం కాదని.. ఎన్ని గంటల పాటు సమావేశమైంది, ఎంత మంచి చర్చ జరిగిందన్నది ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రతిపక్ష నేతల మానసిక స్థితి దెబ్బతిన్నదని ఎద్దేవా చేశారు.





అసెంబ్లీలో చర్చ సజావుగా సాగేలా చూడాలని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఇండియా కూటమి పేరిట చర్చ జరగనివ్వలేదని పేర్కొన్నారు. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను బీఆర్‌ఎస్‌, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు సభాపతికి అందించాయి. భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వ చర్యల.. సంక్షేమ పథకాలపై సభలో చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశాల్లో దాదాపు పది బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గవర్నర్ వెనక్కు పంపిన నాలుగు బిల్లులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు, టిమ్స్ ఆసుపత్రులు, జీఎస్టీ చట్ట సవరణ, కార్మికశాఖకు సంబంధించిన బాయిలర్స్ చట్ట సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.




Updated : 4 Aug 2023 1:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top