Home > తెలంగాణ > త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్తారు : పొంగులేటి

త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్తారు : పొంగులేటి

త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్తారు : పొంగులేటి
X

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి అందరికీ గుడ్ న్యూస్ చెప్తారని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి హుజూర్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్లను పొంగులేటి పరిశీలించారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో గత ప్రభుత్వం కేవలం 150 ఇళ్లు మాత్రమే కట్టిందని.. కానీ గతంలో కాంగ్రెస్‌ హయాంలో ప్రతి గ్రామంలో 100కు పైగా ఇళ్లు కట్టినట్లు తెలిపారు. హుజూర్‌నగర్‌లో 2,160 ఇళ్లు పూర్తి చేసి.. వచ్చే 3, 4 నెలల్లో అర్హులైన పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో అన్యక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తామని పొంగులేటి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇరిగేషన్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి, దుర్మార్గ పాలన సాగిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. నీటిపారుదల శాఖలో అనేక లోటుపాట్లు ఉన్నాయన్న ఆయన.. చెక్‌డ్యామ్‌లపై కూడా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామన్నారు. గ్యాస్‌ స్కీమ్‌ను త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు.

Updated : 23 Dec 2023 11:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top