Home > తెలంగాణ > మేడిగడ్డ సందర్శనకు మంత్రులు.. వారంతా రావాలని ఆదేశం

మేడిగడ్డ సందర్శనకు మంత్రులు.. వారంతా రావాలని ఆదేశం

మేడిగడ్డ సందర్శనకు మంత్రులు.. వారంతా రావాలని ఆదేశం
X

కాళేశ్వరం ప్రాజెక్ట్పై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక నజర్ పెట్టింది. ఈ నెల 29న మేడిగడ్డ బ్యారేజ్ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సందర్శించనున్నారు. ప్రాజెక్ట్ వ్యయం, సమస్యలు, వాటి పరిష్కారాలపై సమీక్ష చేయనున్నారు. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రజెంటేషన్ తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శిస్తారు. నిర్మాణంలో భాగస్వామ్యులైన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రులు ఆదేశించారు.

మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ వద్ద మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. బ్యారేజీ పిల్లర్ కుంగడంతో కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టీ మరమ్మత్తులు చేపడుతోంది. మొదటి దశలో రూ.55 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టనుంది. బ్యారేజీ 7వ బ్లాక్ లోని పిల్లర్లు కుంగగా.. రిపేర్లు చేసేందుకు వీలుగా నీళ్లు రాకుండా 7, 8వ బ్లాక్ ల చుట్టూ కాఫర్ డ్యామ్ నిర్మిస్తోంది. గత రెండ్రోజులుగా భారీ నిర్మాణ యంత్రాల సహాయంతో గోదావరి ఒడ్డున ఉన్న మట్టి, రాళ్లు అడ్డుగా పొస్తున్నట్లు తెలుస్తోంది. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక పిల్లర్ల దగ్గర ఇసుకను తవ్వి చూస్తేనే బ్యారేజీ ఎంత మేరకు డ్యామేజీ అయిందనేది క్లారిటీ రానుంది. ఇక బ్యారేజీ వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఇరిగేషన్ శాఖ అనుమతి ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి.

Updated : 25 Dec 2023 3:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top