Home > తెలంగాణ > Telangana Congress: పైసలతోపాటు తులం బంగారం.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..!

Telangana Congress: పైసలతోపాటు తులం బంగారం.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..!

Telangana Congress: పైసలతోపాటు తులం బంగారం.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..!
X

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల హామీతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్తోంది. ఆరు గ్యారెంటీలతో పాటు మరికొన్ని కీలక హామీలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. మరిన్ని హామీలతో ప్రజలకు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక సూచనలు చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పథకాలు అయిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లను పేరు మార్పుతో యథాతథంగా కొనసాగించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. వీటికి పసుపు కుంకుమ పేరు పెట్టాలన్నారు. లక్ష రూపాయలతో పాటు అదనంగా తులం బంగారం ఇవ్వాలని మ్యానిఫెస్టో కమిటీకి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు కమిటీ సూత్రప్రాయంగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఆమోదించేలా చూస్తామని శ్రీధర్ బాబు జీవన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం.

Updated : 7 Oct 2023 4:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top