Home > తెలంగాణ > అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
X

కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

గతంలోనే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ సమక్షంలో ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయగా.. బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. సీనియర్లను కాదని, అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రొటెం స్పీకర్ గా అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేదు. పూర్తిస్థాయి స్పీకర్ నియామకం తర్వాతే సభలో అడుగుపెడతామని వెల్లడించారు. తాజాగా పూర్తిస్థాయి స్పీకర్గా గడ్డం ప్రసాద్ ను నియమించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.




Updated : 14 Dec 2023 10:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top