Home > తెలంగాణ > రానున్న ఐదు రోజులు భానుడి భగభగలు .. అప్రమత్తంగా ఉండాలని సూచన

రానున్న ఐదు రోజులు భానుడి భగభగలు .. అప్రమత్తంగా ఉండాలని సూచన

రానున్న ఐదు రోజులు భానుడి భగభగలు .. అప్రమత్తంగా ఉండాలని సూచన
X

రాష్ట్రంలో మార్చి మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతున్నాయి.రోజురోజుకు ఉష్ణోగ్రతలు మరింత పెరగుతున్నాయి. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నది. అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జోగులాంబ గద్వాల, సూర్యాపేట, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో 38.9 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో నేటి నుంచి గురువారం వరుకు ఎండల తీవ్రత పెరిగే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలాల్లో 38.9, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల చొప్పున నమోదయ్యాయని వెల్లడించాయి. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated : 3 March 2024 4:42 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top