Home > తెలంగాణ > Out of Stock.. ఎన్టీఆర్ రూ.100 నాణెం కోసం క్యూ కట్టిన జనాలు

Out of Stock.. ఎన్టీఆర్ రూ.100 నాణెం కోసం క్యూ కట్టిన జనాలు

Out of Stock.. ఎన్టీఆర్ రూ.100 నాణెం కోసం క్యూ కట్టిన జనాలు
X

స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి స్మారకార్థం విడుదల చేసిన రూ. 100 ల నాణేనికి విశేష స్పందన లభిస్తోంది. సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదలైనా ఈ నాణేన్ని మంగళవారం నుంచి విక్రయానికి అందుబాటులో ఉంచారు. దీంతో తొలిరోజే విశేష స్పందన లభించింది. సైఫాబాద్, చర్లపల్లి మింట్ లలో మంగళవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నాణేన్ని విక్రయానికి అందుబాటులో ఉంచారు. రెండు కేంద్రాల్లో కలిపి తొలిరోజు ఐదు వేల వరకు నాణేలు విక్రయాలు జరిగాయి. కొద్ది నిమిషాల్లోనే ముద్రించిన నాణేలన్ని విక్రయాలు జరిగిపోయాయి. దీంతో ఆన్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించిన కొద్ది గంటలకే వెబ్‌సైట్‌లో అవుటాఫ్ స్టాక్ బోర్డు పెట్టారు. ఇప్పటి వరకు ఏ స్మారక నాణేన్ని పదివేలకు మించి ముద్రించలేదని, ఎన్టీఆర్ నాణేనికి డిమాండ్ ఉంటుందని భావించి 12వేలు ముద్రించామని మింట్ ఫైనాన్స్ జాయింట్ జనరల్ మేనేజర్ గుండపునీడి శ్రీనివాస్ చెప్పారు

తమ అభిమాన నటుడి స్మారకార్థం తయారు చేసిన ఈ నాణేన్ని కొనుగోలు చేయడం ఎంతో గర్వంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. సైఫాబాద్, చర్లపల్లి మింట్ కేంద్రాలు ఎన్టీఆర్​ అభిమానులతో సందడిగా మారాయి. ఎన్టీఆర్​ శతజయంతి పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 నాణాన్ని రాజ్​భవన్​లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్ట్​ 28న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఇతర ప్రముఖ నాయకులు హాజరయ్యారు.కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 నాణెం(100 Rupee Coin) ధరను మూడు రకాలుగా ప్రజలకు అందుబాటులోకి ఉంచింది. రూ.4,850 చెక్క డబ్బాతో, రూ.4,380 ఫ్రూప్​ ఫోల్డర్​ ప్యాక్​, రూ.4,050 యూఎస్​సీ ఫోల్డర్​ ప్యాక్​గా నిర్ణయించింది. ఈ నాణం తయారికీ వెండి 50 శాతాన్ని, రాగిని 40 శాతాన్ని, జింక్, నికెల్​లు 5 శాతాల మిశ్రమంగా రూపొందించారు. దీన్ని అభిమానులకి ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో కొనుగోలు చేసే సదుపాయం కల్పించింది. ఈ నాణెం కావాల్సిన వారు https://www.indiagovtmint.in/en/commemorative-coins/ ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చని ముద్రణ అధికారులు తెలిపారు.

Updated : 30 Aug 2023 3:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top