Home > తెలంగాణ > తెలంగాణలో మరోసారి IPS అధికారుల బదిలీలు

తెలంగాణలో మరోసారి IPS అధికారుల బదిలీలు

తెలంగాణలో మరోసారి IPS అధికారుల బదిలీలు
X

తెలంగాణలో ఐపీఎల్ అధికారుల బదిలీ మరోసారి జరిగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేయగా.. తాజాగా మరో నలుగురు ఐపీఎస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. మహబూబాబాద్ ఎస్పీ పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతిరావు బదిలీ చేసిన ప్రభుత్వం.. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో మహబూబాబాద్ ఎస్పీగా కే. సుధీర్ రామ్‌నాథ్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన అధికారులు:

• హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా అకాంక్ష్ యాదవ్‌

• మంచిర్యాల డీసీపీగా అశోక్ కుమార్‌

• మహబూబాబాద్ ఎస్పీగా కే. సుధీర్ రామ్‌నాథ్‌

• మహబూబాబాద్ ఎస్పీ పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతిరావు (డీఎస్పీ ఆఫీస్ లో రిపోర్ట్)

Updated : 1 March 2024 3:57 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top