Home > తెలంగాణ > ఉప్పొంగిన పెన్గంగ.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్

ఉప్పొంగిన పెన్గంగ.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్

ఉప్పొంగిన పెన్గంగ.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్
X

ఐదు రోజులుగు కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నారు. వరద నీరు భారీగా వచ్చిన చేరుతుండటంతో నదుల ప్రవాహ ఉద్ధృతి పెరిగింది.జైనథ్‌ మండలం డొలారా వద్ద పెన్‌గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకింది. ఫలితంగా తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని 44వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు.

వరద ఉద్ధృతి కారణంగా తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. వరద ప్రవాహం తగ్గిన తర్వాత రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు. ప్రవాహ ఉద్ధృతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి డొలారా వంతెన వద్ద పరిస్థితిని సమీక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్లే వాహనాలను జైనథ్ మండలంలోని పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.




Updated : 22 July 2023 4:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top