Home > తెలంగాణ > KCR : నేడు కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ భేటీ

KCR : నేడు కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ భేటీ

KCR : నేడు కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ భేటీ
X

నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తమ పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. గత నెల 7న తుంటి ఎముకకు గాయమైన తర్వాత ఆయన నిర్వహిస్తున్న అధికార సమావేశం ఇదే కావడం గమనార్హం. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ భేటీ జరగనుంది. లోక్ సభ ఎన్నికలకు ముందు చివరి సమావేశలు కావడంతో నాయకులు అనుసరించాల్సిన వ్యూహాలపై మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారని తెలుస్తోంది. సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు ఆయన సూచనలు చేయనున్నారు.ఈ పరిస్థితుల్లో పార్టీ విధానం, సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపిలకు అధినేత కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సమావేశంపై ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కెసిఆర్ శుక్రవారం దిశానిర్దేశం చేస్తారని వెల్లడించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే బడ్జెట్‌పై కేంద్రం ఎంత మేరకు సీరియస్‌గా ఉందో చూడాలన్న ఆయన, కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కే పరిమితం అవుతారా, పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహిస్తారా వేచి చూడాలన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే బిఆర్‌ఎస్ ఉందన్న రంజిత్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే తనపై ఎందుకు కేసు పెట్టారో మాజీ ఎంపి విశ్వేశ్వర్ రెడ్డినే అడగాలన్న ఆయన, ఆ తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు తనపై ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదని, తనకు సంస్కారం ఉందని రంజిత్ రెడ్డి తెలిపారు.




Updated : 26 Jan 2024 3:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top