Home > తెలంగాణ > తెలంగాణకు మరో వందే భారత్

తెలంగాణకు మరో వందే భారత్

తెలంగాణకు మరో వందే భారత్
X

తెలంగాణకు మరో వందే భారత్ రైలు రాబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ , సికింద్రాబాద్-తిరుపతి రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు కొనసాగుతున్నాయి. ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు ఈ ట్రైన్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతే కాదు ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ఈ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు తెలంగాణలో అందుబాటులో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‎లలో రద్దీ పెరుగుతుండటంతో హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు వెళ్లే ప్రయాణికుల డిమాండ్ మేరకు మరో వందే భారత్ ట్రైన్‎ను రైల్వేశాఖ ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా తెలంగాణలో కొత్తగా కాచిగూడ-యశ్వంత్‌పూర్ వయా బెంగళూరు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకారానుంది.

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ఈ వందే భారత్ ట్రైన్‎ను ప్రారంభిస్తారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో జరగే ఈ ప్రోగ్రామ్‎లో సెంట్రల్ మినిస్టర్ , బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొంటారు. ఈ రైలు కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం రైల్వేస్టేషన్ల మీదుగా యశ్వంత్‌పూర్‌ వరకు ప్రయాణిస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ , బెంగళూరు మధ్య ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉంటాయి. నిత్యం ఐటీ ఎంప్లాయిస్‎తో పాటు బిజినెస్ అవసరాల కోసం ఎక్కువమంది ప్రజలు ఈ మార్గంలో ప్రయాణం చేస్తుంటారు. వీరికి ఈ కొత్త రైలు ఎంతగానో ఉపయోగపడనుంది.


Updated : 21 Sep 2023 5:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top