Home > తెలంగాణ > Rajagopal Reddy : కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు..రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy : కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు..రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy : కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు..రాజగోపాల్ రెడ్డి
X

తెలంగాణ అసెంబ్లీ రసభాసాగా సాగుతోంది. బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో..ఇప్పుడు కూడా అలానే ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఒక మంత్రి మాట్లాడుతుంటే కేటీఆర్ అహంకారంతో కూర్చోమని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు చెంప చెల్లుమనిపించిన కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ రాచరిక పాలన వద్దనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు బీఆర్ఎస్ ను ప్రతిపక్షంలోకి పంపారని చెప్పారు. కడియం శ్రీహరి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాటికొండ రాజయ్యను కడియం శ్రీహరి మోసం చేశారని ఆరోపించారు. రాజయ్యను అవమానించి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి అందులో శ్రీహరి కూర్చున్నరని దుయ్యబట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవిని కూడా రాజయ్య దగ్గర నుంచి లాక్కున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహరాలను మీరేలా చెబుతారని ప్రశ్నించారు. తనకు పదవి ముఖ్యం కాదని.. ప్రజా సేవ కోసం వచ్చానని చెప్పుకొచ్చారు. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగానే ఉంటుందని విమర్శించారు. ఆరు గ్యారెంటీల పథకాలు విడతల వారిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు తెలిపారు. రెండుసార్లు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చినప్పటికీ ప్రజలకు ఏం చేయలేదని దుయ్యబట్టారు. ప్రజలకు నిజాలు చెబుతుంటే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేక పోతున్నారని మండిపడ్డారు. స్వార్థం కొసం అప్పులు చేసి...రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తెలిపారు. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రమ్మనండని రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు.




Updated : 14 Feb 2024 7:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top