Home > తెలంగాణ > ప్రగతి భవన్లో ఘనంగా రాఖీ పండుగ

ప్రగతి భవన్లో ఘనంగా రాఖీ పండుగ

ప్రగతి భవన్లో ఘనంగా రాఖీ పండుగ
X

రాష్ట్రవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నాచెల్లెళ్లు, అక్కతమ్ముళ్ల ప్రేమానురాగాలు, అనురాగం, ఆప్యాయతలకు ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రగతి భవన్ లోనూ సంబురంగా జరిగింది. రాఖీ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆయన తోబుట్టువులు రాఖీలు కట్టి మిఠాయి తినిపించారు. కేసీఆర్ అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మతో పాటు చెల్లెలు వినోదమ్మ కేసీఆర్కు రాఖీ కట్టారు. అనంతరం కేసీఆర్ తోబుట్టువుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.


Updated : 31 Aug 2023 12:00 PM GMT
Tags:    
Next Story
Share it
Top