Home > తెలంగాణ > కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్.. ఆకునూరి మురళి సెటైర్లు

కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్.. ఆకునూరి మురళి సెటైర్లు

కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్.. ఆకునూరి మురళి సెటైర్లు
X

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకోసం ఆమె ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఎక్స్ వేదికగా స్పందించారు. అప్పటి ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి.. కొత్త ప్రభుత్వం రాగానే కేంద్రంకు వెళ్లి ఇక్కడి తప్పులను తప్పించుకోవడం కొంత మంతి ఐఏఎస్ అధికారులకు ఫ్యాషన్ అయిపోయిందన్నారు. అలాంటి వాళ్లను కేంద్రానికి పంపకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏం తప్పులు చేయకపోతే భుజాలు తడుముకోవడం ఎందుకు అని ప్రశ్నించారు. 'దేశం మొత్తంలో హెలికాప్టర్ లో వెళ్లి పనులను ఇన్స్పెక్ట్ చేసిన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమె మాత్రమే' అంటూ స్మితా సబర్వాల్ ను ఉద్దేశించి ఆకునూరి మురళి సెటైర్లు వేశారు.

కాగా స్మితా సబర్వాల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ కు అడిషనల్ సెక్రటరీగా పని చేశారు. ప్రస్తుతం ఆమె నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు స్మితా సబర్వాల్ సీఎంను కలవకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే స్మితా సబర్వాల్ ను కేంద్రానికి పంపి ఆమె స్థానంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమ్రపాలిని రాష్ట్రానికి తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Updated : 13 Dec 2023 2:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top