Home > తెలంగాణ > డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది - రేవంత్ రెడ్డి

డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది - రేవంత్ రెడ్డి

డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది - రేవంత్ రెడ్డి
X

సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మోసం చేయడంలో ఆయనను మించినవారు లేరని అన్నారు. కేసీఆర్ మనుషులనే కాక దేవుళ్లను సైతం మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ నారాయణఖేడ్ లో నిర్వహించిన విజయభేరీ సభలో మాట్లాడారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్టుల దగ్గర కూర్చుంటానన్న కేసీఆర్ చేసిందేమీలోదని అన్నారు. గ్రామాలు బాగుపడాలంటే బీఆర్ఎస్‌ను గద్దెదించాలని రేవంత్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం పక్కా అని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. నారాయణఖేడ్, జహీరాబాద్‌లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. రాష్ట్రంలో డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం రాబోతోందన్న ఆయన.. కాంగ్రెస్ సర్కార్ రాగానే తండాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మహిళల సమస్యలు తీరుతాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల సొమ్ముతో ప్రగతి భవన్ గడీ కట్టుకున్న కేసీఆర్.. అందులోకి పేదల ప్రవేశాన్ని నిషేధించారని ఫైర్ అయాయరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నారాయణఖేడ్‌ను దత్తత తీసుకుంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Updated : 22 Nov 2023 12:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top