Home > తెలంగాణ > సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన ఖరారు

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన ఖరారు

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన ఖరారు
X

ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన చేయనున్నారు. జనవరి 15 నుంచి 19వ తేదీ మధ్య దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో రేవంత్ పాల్గొననున్నారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, మరికొందరు రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సదస్సులో భాగంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అంశాలు, ప్రయోజనాలపై వారితో చర్చించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టగా.. ఆయా కంపెనీల ప్రతినిధులతో కూడా తెలంగాణ ప్రతినిధులు భేటీ కానున్నారు. రాష్ట్రంలో మరికొన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని కోరనున్నారు.

సీఎం రేవంత్ పాల్గొనే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో.. వంద దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈసారి ల్యాబ్ నుంచి లైఫ్ టు లైఫ్-సైన్స్ ఇన్ యాక్షన్ అనే అంశంతో ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.


Updated : 29 Dec 2023 9:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top