Home > తెలంగాణ > శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. నిందితుడి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. నిందితుడి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. నిందితుడి అరెస్ట్
X

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఎయిర్ పోర్టులో డోర్లు తీశారో బాంబు పేలుద్దీ, మిమ్మల్ని మర్డర్ చేయడానికి హిజాకర్ ఉపయోగిస్తున్నట్లు పంపాడు. దీనిపై విచారించిన పోలీసులు అది ఫేక్ మెయిల్ అని గుర్తించి, మెయిల్ పంపిన వైభవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు బీహార్ వాసి కాగా బెంగుళూరులో స్ధిరపడ్డారు. కరోనా టైమ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వైభవ్ తివారీ ఉద్యోగం కోల్పోయాడు. దాంతో ఆర్థిక సమస్యలు మొదలై, చివరికి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఇక అది మొదలుకుని గత కొంతకాలం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నాడు. దాదాపు వందసార్లు ఇలాంటి ఫేక్ వార్నింగ్ అలర్ట్ మెయిల్స్ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

విమానంలో హైజాకర్లు వచ్చారని గతంలో పలుమార్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులకు మెయిల్స్ చేసి కలకలం రేపాడు. ఫేక్ మెయిల్స్ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన ఎయిర్ పోర్టు పోలీసులకు నిందితుడి ఆచూకీ దొరికింది. బెంగళూరుకు చెందిన టెకీ వైభవ్ తివారీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న ఉదయం 7 గంటలకు వైభవ్ తివారీ ఓ మెయిల్ చేశాడు. హైజాకర్ వస్తున్నాడు, మీరు ఎయిర్ పోర్ట్ ఓపెన్ చేయవద్దు అని బెదిరింపు మెయిల్ పంపించాడు. ఆదివారం సైతం నిందితుడు వైభవ్ మరో బెదిరింపు మెయిల్ ఎయిర్ పోర్ట్ అధికారులకు పంపాడు. మీరు బాగా చదివి ఉంటారు కానీ హైజాకింగ్ డిఫెన్స్ తో హత్యలు చేసే వాళ్లుగా మారుతున్నారు అని మెయిల్‌లో రాసుకొచ్చాడు. వివరాలు సేకరించిన ఎయిర్ పోర్ట్ అధికారులు బెంగళూరుకు వెళ్లి టెకీ వైభవ్ తివారీని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.

Updated : 19 Feb 2024 2:56 PM GMT
Tags:    
Next Story
Share it
Top