Home > తెలంగాణ > తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త జడ్జీలు

తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త జడ్జీలు

తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త జడ్జీలు
X

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు కొత్త జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ, ఏపీలతో సహా.. 7 రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ లు రానున్నారు. తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా.. ప్రస్తుతం కర్ణాటక హైకోర్ట్ జడ్జిగా ఉన్న అలోక్ ఆరాధేను నియమించింది. ముంబై హైకోర్ట్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను ఏపీ హైకోర్ట్ చీఫ్ గా నియమించింది. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో కొలీజియం నిర్ణయం తీసుకుంది. ముంబైకి దేవేంద్రకుమార్, గుజరాత్ కు సునీతా అగర్వాల్, మణిపూర్ కు సిద్ధార్థ్ మృదుల్, కేరళకు ఆశిష్ దేశాయ్, ఒరిస్సాకు సుభాసిస్ తలపత్ర హైకోర్ట్ జడ్జీలుగా నియమితులయ్యారు.








Updated : 6 July 2023 2:42 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top