Home > తెలంగాణ > పక్కా ప్లాన్ ప్రకారమే భూమి కొనుగోలు చేసిన సోమేశ్ కుమార్!

పక్కా ప్లాన్ ప్రకారమే భూమి కొనుగోలు చేసిన సోమేశ్ కుమార్!

పక్కా ప్లాన్ ప్రకారమే భూమి కొనుగోలు చేసిన సోమేశ్ కుమార్!
X

మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఆస్తుల చిట్టాలో తాజాగా కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే రంగారెడ్డి జిల్లా యాచారంలో ఆయన భూములు కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మాసిటీ అక్కడకు వస్తుందని ముందే తెలుసుకొని 2018లో ఆయన అక్కడ భూములు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం నలుగురి వద్ద 25 ఎకరాల భూమిని సోమేశ్ కుమార్ కొనుగోలు చేశారు. ఎకరాకు రూ.3 కోట్లకు పైగా ఉన్న ఆ ప్రాంతంలో.. ఒక్కో ఎకరానికి కేవలం రూ.2 లక్షలు మాత్రమే వెచ్చించి విలువైన భూమిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ ధరకే భూములు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ అనమానం వ్యక్తం చేస్తోంది. కాగా, సోమేశ్ కుమార్ తన భార్య పేరు మీద ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే.

ధరణి పోర్టల్‌లో ఈ భూమికి సంబంధించిన ఖాతా నం.5237గా ఉంది. మరోవైపు.. భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు ఆ స్థాయిలో భూ ఖాతాదారులు లేరు. మరి.. ధరణి పోర్టల్‌లో ఈ ఖాతా నంబరు ఏ విధంగా కేటాయించారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్‌సైట్‌లో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్‌ను పరిశీలిస్తే.. అందులో ఈ భూమి కొనుగోలు చేసిన ఆధారాలు కనిపించడం లేదు. మరోవైపు తాను నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేశానని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అలాట్ చేసిన నివాస స్థలంలో నిర్మించుకున్న గృహాన్ని విక్రయించి కొత్తపల్లి గ్రామంలో ఆరేళ్ల కిందనే ఈ వ్యవసాయ భూమిని కొనుగోలు చేశానని వెల్లడించారు. నాటి ప్రభుత్వం భూమి కొనుగోలుకు అనుమతి కూడా ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఏసీబీ సమగ్ర విచారణ తర్వాత అసలు నిజాలు వెలువడనున్నాయి.

Updated : 30 Jan 2024 3:44 PM GMT
Tags:    
Next Story
Share it
Top