Home > తెలంగాణ > ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు సర్కార్ గుడ్‌ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు సర్కార్ గుడ్‌ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు సర్కార్ గుడ్‌ న్యూస్
X

ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్‎ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30శాతం పెంచింది. బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ 30శాతం పెరిగింది. సెలవు రోజుల్లో పని చేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డైవర్లకు అదనంగా రూ. 150 చెల్లించాలని నిర్ణయించింది. షెడ్యూల్ ఏరియాలో పని చేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30శాతం, దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ.2000 నుంచి రూ.3000 పెంచాలని నిర్ణయిచింది. ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ. 30లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 6లక్షల నుంచి 9 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ 80వేల నుంచి రూ. లక్షకు పెంచుతూ నిర్ణయించింది. ఉద్యోగుల పిల్లల పెళిళ్ళకు సంబంధించి, కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ.1 లక్ష నుంచి రూ. 4 లక్షలకు, కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75వేల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది. స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ 30శాతం పెరిగింది.

గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ట్రాఫిక్, సీఐడి, ఆక్టోపస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేస్ ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింప చేయనుంది. పింఛనర్లు చనిపోతే అందించే తక్షణ సాయం రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచింది. ప్రోటోకాల్ డిపార్ట్ మెంట్ లో విధులు నిర్వర్తించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15శాతం స్పెషల్ పే మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విభాగాల వారీగా ఉత్వర్వులు జారీ చేసింది.

Updated : 23 Jun 2023 10:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top