Home > తెలంగాణ > MC Transfers: రాష్ట్రంలో మరో 74 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

MC Transfers: రాష్ట్రంలో మరో 74 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

MC Transfers: రాష్ట్రంలో మరో 74 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
X

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. రాష్ట్రంలో నిన్న 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. కాగా తాజాగా బుధవారం మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పురుపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని పలువురు అధికారులను బదిలీ చేసింది. పంచాయతీరాజ్‌ శాఖలో 105 మంది జడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, డీపీవోలు, డీఆర్డీవోలను బదిలీ చేసింది. అలాగే 395 మంది ఎంపీడీవోలు, 132 మంది తహసీల్దార్లు, 33 మంది నాయబ్‌ తహసీల్దార్లు కూడా బదిలీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆబ్కారీశాఖనూ బదిలీల జాబితాలో చేర్చారు. ఆ శాఖలో కూడా 25 మందిని ట్రాన్సఫర్ చేసింది.




Updated : 14 Feb 2024 4:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top