Home > తెలంగాణ > హైకోర్టులో కేసీఆర్ సర్కార్కు చుక్కెదురు.. వీఆర్‌ఏల సర్దుబాటు నిలిపివేత

హైకోర్టులో కేసీఆర్ సర్కార్కు చుక్కెదురు.. వీఆర్‌ఏల సర్దుబాటు నిలిపివేత

హైకోర్టులో కేసీఆర్ సర్కార్కు చుక్కెదురు.. వీఆర్‌ఏల సర్దుబాటు నిలిపివేత
X

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇతర శాఖల్లొ వీఆర్ఏలను సర్ధుబాటు చేస్తూ ఇచ్చిన జీవోలను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. జీవో జారీకి ముందున్న స్థితిని అలాగే కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు వీఆర్ఏలు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

వీఆర్‌ఏలను ఇతర శాఖల్లోకి బదిలీ చేయాలని ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ జీవోలను జారీ చేశాయి. దీంతో వారిని ఇతర శాఖల్లోకి నియమిస్తూ ఈనెల 3న సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 61ఏళ్లలోపు వయసున్న 16వేల 758 మంది వీఆర్‌ఏలను వారి విద్యార్హతలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో లోయర్ గ్రేడ్ సర్వీస్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉద్యోగ విరమణ వయసు దాటిన మరో 3,797 మంది స్థానంలో వారి కుమారులు లేదా కుమార్తెలకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే చట్టాలు, సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందని.. తమకు రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని పలువురు వీఆర్‌ఏలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు.. జీవోలను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Updated : 10 Aug 2023 1:43 PM GMT
Tags:    
Next Story
Share it
Top