Home > తెలంగాణ > మంత్రి కొప్పుల ఈశ్వర్‎కు హైకోర్టు షాక్..మధ్యంతర పిటిషన్ కొట్టివేత

మంత్రి కొప్పుల ఈశ్వర్‎కు హైకోర్టు షాక్..మధ్యంతర పిటిషన్ కొట్టివేత

మంత్రి కొప్పుల ఈశ్వర్‎కు హైకోర్టు షాక్..మధ్యంతర పిటిషన్ కొట్టివేత
X

బీఆర్ఎస్ పార్టీ కీలక నేత తెలంగాణ రాష్ట్ర మినిస్టర్ కొప్పుల ఈశ్వర్‎కు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. మంత్రి వేసిన మధ్యంతర పిటిషన్‎ను కొట్టేసింది.

తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలంటూ మంత్రి హై కోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. దాదాపు 3 ఏళ్లపాటు జరిగిన విచారణలో వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు ఈ పిటిషన్‏ను తోసిపుచ్చింది. తుది వాదనల కోసం కేసును బుధవారానికి వాయిదా వేసింది.

2018 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసిన కొప్పుల ఈశ్వర్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఆయనపై పోటీగా కాంగ్రెస్ టికెట్‎తో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్నికల బరిలో దిగారు. అయితే అక్రమ పద్ధతుల్లో కొప్పుల ఈశ్వర్‌ ఎన్నికల్లో గెలిచారని.. ఆయన ఎన్నిక చెల్లదంటూ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ 2018లో హైకోర్టులో పిటిషన్‌ చేశారు. ఆయన్ను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో లక్ష్మణ్ పిటిషన్‎ను కొట్టేయాలంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 3 ఏళ్ల విచారణ అనంతరం తాజాగా హైకోర్టు మంత్రి పిటిషన్ ను కొట్టేసింది. తుది విచారణను రేపటికి వాయిదా వేసింది.

Updated : 1 Aug 2023 8:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top