Home > తెలంగాణ > ప్రధాని మోదీతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన అంశాలు ఇవే..

ప్రధాని మోదీతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన అంశాలు ఇవే..

ప్రధాని మోదీతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన అంశాలు ఇవే..
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy ) ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇటు కేంద్రంలో పెద్దలతో పాటు తమ పార్టీ పెద్దలతో చర్చించేందుకు హస్తినకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. మొదటగా ప్రధాని నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi)తో సమావేశం అయ్యారు. సీఎం హోదాలో తొలిసారిగా ప్రధానితో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణకు కేంద్ర నుండి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు ఆంధ్ర ప్రదేశ్ పునర్విభన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ప్రధానిని కోరారు

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్లే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కల్పించాలని రేవంత్ ప్రధానిని కోరారు. పునర్విభజన చట్టంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పిస్తామన్న హామీ ఇచ్చారని... తెలంగాణలో ఆ హామీ నేరవేర్చలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. సీఎం రేవంత్, డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తిపై ప్రధాని సానుకూలంగా స్పందించడమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక్కొక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం మీడియాకు స్పష్టం చేశారు. ప్రధానితో భేటీ అనంతరం పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ(Sonia Gandhi) నివాసానికి వెళ్లారు. తెలంగాణలో జరగబోయే లోక్ సభ ఎన్నికలపై చర్చించారు. అదే విధంగా తెలంగాణ అభివృద్ది అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

మోదీ దృష్టికి సీఎం, డిప్యూటీ సీఎం తీసుకెళ్లిన అంశాలు..

-పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించాలి

-ఆంధ్రప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం 2015 నుంచి 2021 వ‌ర‌కు ప్ర‌తి ఏటా రూ.450 కోట్లు చొప్పున రూ.2250 కోట్ల‌ను కేంద్రం విడుద‌ల చేసింది. 2019-20, 21-22, 22-23, 23-24 సంవ‌త్స‌రాల‌కు సంబంధించి పెండింగ్ గ్రాంట్లు రూ.1800 కోట్లు విడుద‌ల చేయాలి.

-పెండింగ్‌లో ఉంచిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2233.54 కోట్లు (2022-23కు సంబంధించి రూ.129.69 కోట్లు, 2023-24కు సంబంధించి రూ.1608.85 కోట్లు) వెంట‌నే విడుద‌ల చేయాలి

-రాష్ట్రంలో 14 ర‌హ‌దారుల‌ను జాతీయ ర‌హ‌దారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ప్ర‌తిపాద‌న‌లు పంపించాం. అందులో కేవ‌లం రెండింటికే ఆమోదం తెలిపారు. మిగ‌తా 12 ర‌హ‌దారుల అప్‌గ్రేడ్‌న‌కు ఆమోదం తెల‌పాలి.

-ములుగులోని గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2023-24 విద్యా సంవ‌త్స‌రంలో ప్ర‌వేశాల‌కు అనుమ‌తి ఇవ్వాలి.

-ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం పూర్వ ఖ‌మ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం (బ‌య్యారం స్టీల్ ప్లాంట్‌) ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చినందున దానిని వెంట‌నే నెర‌వేర్చాలి. అలాగే కాజీపేటలో కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయాల్సి ఉండ‌గా పీరియాడిక‌ల్ ఓవ‌ర్‌హాలింగ్ వ‌ర్క్‌షాప్ ఏర్పాటు చేస్తామ‌ని రైల్వే శాఖ ప్ర‌క‌టించింది. దానికి అద‌నంగా కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయాలి.

- 2010లో నాటి కేంద్ర ప్ర‌భుత్వం బెంగ‌ళూర్‌, హైద‌రాబాద్‌ల‌కు ఐటీఐఆర్‌ను ప్ర‌క‌టించింది. కానీ 2014లో కేంద్రంలో ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత హైద‌రాబాద్ ఐటీఐఆర్‌ను ప‌క్క‌న‌పెట్టారు, హైద‌రాబాద్ ఐటీఐఆర్‌ను వెంట‌నే పున‌రుద్ధ‌రించాలి.

- పీఎం మిత్ర కింద గుర్తించిన ఏడు మెగా జౌళి పార్కుల్లో వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెగా జౌళి పార్కును బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్ర‌క‌టించడంతో దానికి రావ‌ల్సిన‌న్ని నిధులు రానందున వెంట‌నే దానిని గ్రీన్‌ఫీల్డ్‌లోకి మార్చాలి.

- ప్ర‌తి రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాల‌నే ప్ర‌తిపాద‌న ఉంది, తెలంగాణ‌లో ఐఐఎం లేనందున హైద‌రాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి, అందుకు త‌గిన స్థ‌లం అందుబాటులో ఉంది. కేంద్రం కోరితే ఐఐఎం ఏర్పాటుకు అవ‌సర‌మైన స్థ‌లం ఇవ్వ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది.

- ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న రెండు సైనిక పాఠ‌శాల‌లు రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లిపోయాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సైనిక స్కూల్ లేనందున సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సైనిక పాఠ‌శాల ఏర్పాటు చేయాలి.

- భార‌తీయ సైన్యానికి సంబంధించిన ప్ర‌ధాన కార్యాల‌యాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నా ద‌క్షిణాదిలో లేనందున పుణెలో ఉన్న ప్ర‌ధాన కార్యాల‌యాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు త‌ర‌లించాలి.

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని ప్ర‌భుత్వ సంస్థ‌ల విభ‌జ‌న‌, ప‌దో షెడ్యూల్‌లోని సంస్థ‌ల అంశాల‌ను ప‌రిష్క‌రించాలి. ఢిల్లీలోని ఉమ్మ‌డి భ‌వ‌న్ విభ‌జ‌న‌కు స‌హ‌క‌రించాలి.

Updated : 27 Dec 2023 3:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top