Home > తెలంగాణ > Malla Reddy : నన్ను కావాలనే టార్గెట్ చేశారు..

Malla Reddy : నన్ను కావాలనే టార్గెట్ చేశారు..

Malla Reddy : నన్ను కావాలనే టార్గెట్ చేశారు..
X

కాంగ్రెస్ సర్కార్ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కావాలనే కొంతమంది తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మల్లారెడ్డి..అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని ఆరోపించారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకొనే తాను అప్పుడు కాలేజీ కోసం రోడ్డు వేశానని అన్నారు.

2,500 గజాల రోడ్డు స్థలానికి గాను ప్రత్యామ్నాయంగా తన స్థలాన్ని అప్పుడు మున్సిపాలిటీకి ఇచ్చానని అన్నారు. కాలేజీ రోడ్డు తొలగించడంతో 25 వేలమంది విద్యార్థులు, అధ్యాపకులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. రోడ్డు తొలగించడంతో ఇకపై ఆయన కాలేజీ వద్ద ట్రాఫిక్ భారీగా పెరిగిపోతుందని మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 2 March 2024 9:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top