Home > తెలంగాణ > డ్రగ్స్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. ఆలస్యంగా వెలుగులోకి..

డ్రగ్స్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. ఆలస్యంగా వెలుగులోకి..

డ్రగ్స్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. ఆలస్యంగా వెలుగులోకి..
X

డ్రగ్స్‌ కేసులో మాదాపూర్‌ పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. డైరెక్టర్ మంతెన వాసు వర్మతో పాటు సినీ రచయిత మన్నేరి పృథ్వీ కృష్ణను అరెస్టు చేశారు. వారి నుంచి 70 గ్రాముల కొకైన్‌తో పాటు ఫారిన్ లిక్కర్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మంతెన వాసు వర్మను పోలీసులు ఈ నెల 5న అరెస్ట్ చేయగా ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇదే కేసులో సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ అలియాస్‌ దివాకర్‌, పుణేకు చెందిన ఈవెంట్‌ నిర్వాహకుడు రాహుల్‌ అశోక్‌ తెలోర్‌ గత జూన్‌లో అరెస్ట్ కాగా తాజాగా ఈ విషయం బహిర్గతమైంది.

ముంబైకి చెందిన విక్టర్‌, పుణేలో నివాసముండే రాహుల్‌ అశోక్‌ తెలోర్‌ నుంచి నార్సింగికి చెందిన పృథ్వీకృష్ణ డ్రగ్స్‌ కొనుగోలు చేసేవాడు. విషయం తెలియడంతో సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు గత జూన్‌ 19న పృథ్వీకృష్ణ, రాహుల్‌ను అదుపులోకి తీసుకుని వీరి నుంచి 70 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరు ఇచ్చిన సమాచారంతో ‘బస్తీ’ చిత్ర డైరెక్టర్, నిర్మాత అయిన మంతెన వాసువర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 5న మాదాపూర్‌ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. మరో డ్రగ్ పెడ్లర్ విక్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Updated : 25 Sep 2023 2:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top