Home > తెలంగాణ > Revanth Reddy: కొడుకు గుర్తొస్తున్నాడని ట్వీట్.. కేటీఆర్కు రేవంత్ రెడ్డి కౌంటర్

Revanth Reddy: కొడుకు గుర్తొస్తున్నాడని ట్వీట్.. కేటీఆర్కు రేవంత్ రెడ్డి కౌంటర్

Revanth Reddy: కొడుకు గుర్తొస్తున్నాడని ట్వీట్.. కేటీఆర్కు రేవంత్ రెడ్డి కౌంటర్
X

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కొడుకు గుర్తొస్తున్నాడని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొడుకుతో కొన్ని రోజుల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లుతోందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు నానా అవస్థలు పడుతున్నారని, ఆ బిడ్డల తల్లిదండ్రుల శాపం కేసీఆర్ సర్కారుకు తగులుతుందని ట్వీట్ చేశారు.

కేటీఆర్.. దూరంగా ఉన్న బిడ్డ గుర్తొచ్చి గుండె బరువెక్కుతోందా కొద్ది రోజుల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతుంది కదా అని రేవంత్ ప్రశ్నించారు. ఉద్యోగం కోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని, లక్షలాది మంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా అని నిలదీశారు. ప్రభుత్వ హాస్టళ్లలో పెట్టే తిండి తినలేక ఏడుస్తున్న బిడ్డలను చూసి అమ్మానాన్నలు పడే ఆవేదన నీలా కాదనుకున్నావా అని అన్నారు.

కొడుకు తిరిగిరాక, పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుల కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా? మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన 30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన నీలా కాదనుకున్నావా? అని కేటీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. తిండిపెట్టక చిన్నారులని ఏడిపించి, ఫీజు బకాయిలివ్వక యువతని గోసపెట్టి, ఉద్యోగాలివ్వక నిరుద్యోగులని వంచించిన బీఆర్ఎస్ సర్కారుకు తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుందని అన్నారు.

Updated : 11 Oct 2023 12:50 PM GMT
Tags:    
Next Story
Share it
Top