Home > తెలంగాణ > పదేండ్లలో కేసీఆర్ ప్రజల కోసం చేసిందేమీ లేదు - రేవంత్ రెడ్డి

పదేండ్లలో కేసీఆర్ ప్రజల కోసం చేసిందేమీ లేదు - రేవంత్ రెడ్డి

పదేండ్లలో కేసీఆర్ ప్రజల కోసం చేసిందేమీ లేదు - రేవంత్ రెడ్డి
X

తెలంగాణ వచ్చాక బాగుపండింది కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నర్సాపూర్లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అధికారం చేపట్టి పదేండ్లు గడుస్తున్నా ప్రజల కోసం చేసిందేమీలేదని అన్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని రేవంత్ విమర్శించారు.

కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రేవంత్ ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 25లక్షల ఎకరాల అసైన్డ్ భూములను కాంగ్రెస్ పంపిణీ చేసిందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.


Updated : 20 Nov 2023 10:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top