Home > తెలంగాణ > Congress Bus Yatra: డిసెంబర్ 27న ఆ ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి : రేవంత్

Congress Bus Yatra: డిసెంబర్ 27న ఆ ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి : రేవంత్

Congress Bus Yatra: డిసెంబర్ 27న ఆ ఎన్నికలు జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి : రేవంత్
X

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎలాగైన అధికారాన్ని ఛేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించిన హస్తం పార్టీ అటు అగ్రనేతలతో బస్సుయాత్ర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో రేవంత్ సమావేశమయ్యారు. సింగరేణి కార్మికుల త్యాగాలను సీఎం కేసీఆర్‌ మరిచిపోయారన్నారు. సింగరేణికి సీఎండీగా ఒకే అధికారిని ఇంతకాలం ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు.

డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే కార్మికుల సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుందని ఆరోపించారు. అరబిందోకు మైన్ అప్పగించింది నిజం కాదా.. తాడిచర్ల గనులను కేసీఆర్ అనుచరులకు ఇచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు. భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ ఎన్నిసార్లు ఓడిపోయిన ప్రజలతోనే ఉన్నారని.. ఈ సారి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated : 19 Oct 2023 5:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top