Home > తెలంగాణ > డీజీపీకి రేవంత్ రెడ్డి ఫోన్..ఇలా ఐతే కష్టం..

డీజీపీకి రేవంత్ రెడ్డి ఫోన్..ఇలా ఐతే కష్టం..

డీజీపీకి రేవంత్ రెడ్డి ఫోన్..ఇలా ఐతే కష్టం..
X

కాసేపట్లో టీ కాంగ్రెస్ ఖమ్మం సభ ప్రారంభం కానుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సభను హస్తం పార్టీ నిర్వహిస్తోంది. అగ్రనేత రాహుల్ గాంధీ రావడంతో పాటు.. పొంగులేటి, జూపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో పాటు దాదాపు 30 మంది కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనుండంతో ఖమ్మం సభపై ఆసక్తి నెలకొంది. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు.

దాదాపు 5 లక్షల మంది ప్రజలు సభకు రానున్న కాంగ్రెస్ అంచనా వేసింది. అయితే సభకు వస్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేరుగా డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఖమ్మం సభకు వచ్చే వారిని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని రేవంత్ రెడ్డి డీజీపీని కోరారు. పరిస్థితి చేయితే దాటితే బాధ్యత మీదే అని హెచ్చరించారు.

Updated : 2 July 2023 10:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top