Home > తెలంగాణ > అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తాం - రేవంత్ రెడ్డి

అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తాం - రేవంత్ రెడ్డి

అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తాం - రేవంత్ రెడ్డి
X

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రాంనగర్​లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్​ అధికారంలో ఉంటే పెన్షన్​ రూ.2 వేలు వస్తుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే రూ. ​4 వేలు పింఛను ఇస్తామని రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు.

కాంగ్రెస్కు అధికారమిస్తే ప్రతి మహిళకు నెలనెలా రూ. 2,500 ఆర్థిక సాయం అందిస్తామని రేవంత్ చెప్పారు. రూ. 500లకే గ్యాస్​ సిలిండర్​ను అందజేసి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సాయం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.


Updated : 23 Nov 2023 5:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top