Home > తెలంగాణ > TSRTC గుడ్ న్యూస్.. పంద్రాగస్ట్ వేళ టికెట్లపై డిస్కౌంట్

TSRTC గుడ్ న్యూస్.. పంద్రాగస్ట్ వేళ టికెట్లపై డిస్కౌంట్

TSRTC గుడ్ న్యూస్.. పంద్రాగస్ట్ వేళ టికెట్లపై డిస్కౌంట్
X

ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్లో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టి-24 టికెట్ను కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లలకు టి-24 టికెట్ను రూ.50కే అందజేయనుంది.

ఈ నెల 15న మాత్రమే ఈ రాయితీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్ సిటీజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80 గా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో టి-24 టికెట్ను ప్రయాణికులందరికీ రూ.75కే సంస్థ ఇవ్వనుండగా.. పిల్లలకు రూ.50 కే ఇస్తోంది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో సీనియర్ సిటీజన్లకు ఒక్క రోజు టికెట్లో 50 శాతం రాయితీని కల్పిస్తోంది.

"ఆగస్టు 15 భారతీయులందరికీ పండుగ రోజు. మన దేశ చరిత్రలో అదొక మైలురాయి. ఈ శుభదినాన ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. పల్లె వెలుగు బస్సుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. 60 ఏళ్లు దాటిన స్త్రీ, పురుష సీనియర్ సిటీజన్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. వారు ప్రయాణ సమయంలో బస్ కండక్టర్కు తమ ఆధార్ కార్డును చూపించాలి. అలాగే స్వాతంత్ర్య దినోత్సవం రోజున హైదరాబాద్ సిటీలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో టీ-24 టికెట్ను పెద్దలకు రూ.75కే అందజేస్తోంది’’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.


Updated : 13 Aug 2023 3:55 PM GMT
Tags:    
Next Story
Share it
Top