Home > తెలంగాణ > వారం రోజుల్లో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం : సీఎం రేవంత్

వారం రోజుల్లో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం : సీఎం రేవంత్

వారం రోజుల్లో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం : సీఎం రేవంత్
X

రాష్ట్రంలో త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. కొడంగల్లో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. వచ్చే నెల 15లోపు అందరికీ రైతు బంధు నిధులు జమచేస్తామని చెప్పారు. అదేవిధంగా వారం రోజుల్లో 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ హామీలను అమలు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా రూ.2లక్షల రుణమాఫీని సైతం త్వరలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కొడంగల్

కాంగ్రెస్ యుద్ధం ఇంకా ముగియలేదని.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడమే తమ లక్ష్యమని రేవంత్ అన్నారు. ఏ ప్రాజెక్టులు పూర్తి చేశారని కేసీఆర్ ఓట్లడుగుతారని రేవంత్ ప్రశ్నించారు. 2009లో పాలమూరు ప్రజలు కేసీఆర్ను పార్లమెంట్ పంపిస్తే.. ఇక్కడి ప్రాంతానికి చేసిందేమి లేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీరివ్వలేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు పేరు చెప్పి ఇక్కడి ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు.

గత పదేళ్లలో రూ.2లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదని రేవంత్ ఆరోపించారు. అటు మోదీ సైతం పాలమూరుకు చేసిందేమి లేదని విమర్శించారు. రైల్వే ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై మోదీ మాట తప్పారన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి నాలుగు రూపాయలు తెచ్చారా అని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 12 టీఎంసీల నీటీని ఏపీ తరలించుకపోతుందని రేవంత్ అన్నారు. నీళ్లను దోపిడి చేసిన ఏపీ సీఎంకు ప్రగతి భవన్లో భోజనం పెట్టారని మండిపడ్డారు.


Updated : 21 Feb 2024 4:21 PM GMT
Tags:    
Next Story
Share it
Top