Home > తెలంగాణ > Vijayashanthi: 'ఓటమి తట్టుకోలేక'.. BRS మంత్రులపై రాములమ్మ పంచ్‌లు

Vijayashanthi: 'ఓటమి తట్టుకోలేక'.. BRS మంత్రులపై రాములమ్మ పంచ్‌లు

Vijayashanthi: ఓటమి తట్టుకోలేక.. BRS మంత్రులపై రాములమ్మ పంచ్‌లు
X

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ నేత విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై.. సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఓటమి తట్టుకోలేని వారు చేస్తున్న రచ్చ ఇదంటూ రాములమ్మ వ్యాఖ్యానించారు.

‘సుమారు 10 సంవత్సరాల తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టి, 5 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టి ఎల్లిన గత దుర్మార్గ బీఆర్ఎస్ ప్రభుత్వం, అందుకు బాధ్యులైన నాటి బీఆర్ఎస్ మంత్రులు మూడు దినాలల్లనే నూతన సర్కారు అన్ని హామీలను అమలు చేయాలని ప్రశ్నించడం ప్రతిపక్షంగా అన్ని తెలిసి చేస్తున్న మోసపు ప్రకటనలు ప్రయత్నం, ఓటమి తట్టుకోలేని వ్యక్తుల వివాదం' అని మండిపడ్డారు విజయశాంతి.

'విజ్ఞత, బాధ్యతాయుత ధోరణితో ఉండే గత ఆర్థిక మంత్రి హరీష్ రావు గారితో కూడా ఇట్ల ఎందుకు మాట్లాడిస్తున్నరో దవాఖానలో ఉన్న కేసీఆర్ గారు.. తెల్వదు.. ఐనా, మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పదు అన్నది వాస్తవం.. అందుకై మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని విమర్శించే శక్తులను సమర్ధవంతంగా తిప్పికొట్టి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యాచరణను నిరంతరం ప్రజలకు చేర్చవలసిన బాధ్యత.. ఈ సందర్బంగా తెలంగాణ బీఆర్ఎస్ నియంతృత్వ గడిల నుండి విముక్తి కై కొట్లాడి నేటి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకై పనిచేసిన మన వంటి తెలంగాణ ప్రజాస్వామ్యవాదులుపై ప్రస్తుతం తప్పక ఉన్నది’ అంటూ విజయశాంతి తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Updated : 12 Dec 2023 1:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top