Home > తెలంగాణ > Kishan Reddy: సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లు తీసుకొస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణానికి తొలి విడతగా రూ. 900 కోట్లు కేటాయించడంతో పాటు దానికి సమ్మక్క, సారక్క పేరును పెట్టిన ప్రధాని మోడీకి గిరిజన సమాజం, తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. బుధవారం ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను కేంద్రమంత్రి దర్శనం చేసుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లోనూ గిరిజన యువతీ, యువకులకు ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు, గిరిజన వీరుల త్యాగాలను స్మరించుకునేందుకు మోడీ సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో రూ.25 కోట్ల నిధులతో గిరిజన స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టనున్న విషయాన్ని గుర్తు చేశారు. రూ.6.5 కోట్ల కేంద్ర నిధులతో ఏర్పాటు చేసిన గిరిజన పరిశోధన సంస్థ ప్రారంభానికి సిద్దంగా ఉందని చెప్పారు. ములుగు జిల్లాలోని రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చే విషయంలోనూ ప్రధానమంత్రి ప్రత్యేక చొరవతీసుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో రూ.420 కోట్లతో కేంద్రం 17 కొత్త ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

అంతకు ముందు ములుగు జిల్లా పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి గిరిజన ఆరాధ్య దైవం గట్టమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ సమీపంలో సెంట్రల్ వర్సిటీ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి మేడారంలోని సమ్మక్క-సారలమ్మలను కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు.

Updated : 11 Oct 2023 11:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top