Home > తెలంగాణ > హిజ్రాగా మారిన భర్త.. ఏడేళ్ల తర్వాత హత్య

హిజ్రాగా మారిన భర్త.. ఏడేళ్ల తర్వాత హత్య

హిజ్రాగా మారిన భర్త.. ఏడేళ్ల తర్వాత హత్య
X

హిజ్రాగా మారి వేధింపులకు పాల్పడుతున్న భర్తను..సుఫారీ ఇచ్చి హత్య చేయించింది భార్య. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట పట్టణంలో బోయినపల్లికి చెందిన వేదశ్రీకి నాసర్‌పురాకు చెందిన దరిపల్లి వెంకటేశ్‌తో 2014లో వివాహమైంది. ఏడాది తర్వాత వీరికి పాప పుట్టింది. కొద్ది రోజుల తర్వాత వెంకటేష్.. వేదశ్రీని వేధింపులకు గురి చేశాడు. క్రమంగా వెంకటేష్ పవర్తనలో కూడా మార్పు రావడం మెుదలైంది. తర్వాత అతను హిజ్రాగా మారి పోయాడు. దీంతో వేదశ్రీ అతన్ని దూరం పెట్టింది. ఏడేళ్లు గడిచిన తర్వాత వెంకటేష్.. భార్య దగ్గరకు వెళ్ళి పాపను తనకు ఇవ్వాలంటూ తను పని చేస్తున్న పాఠశాలకు వెళ్ళి వేధించేవాడు. దీంతో విరిగిపోయినా వేదశ్రీ పట్టణానికే చెందిన బోయిని రమేశ్‌తో కలిసి భర్త అడ్డు తొలగించేందుకు ప్లాన్ వేసింది.

దీంతో ఇద్దరూ కలిసి వెంకటేష్‌ను చంపాలని సిద్దిపేటకే చెందిన వ్యాపారి పి. రమేశ్‌తో రూ.18 లక్షలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు విడతల్లో అతనికి రూ.4.60 లక్షలను ముట్టజెప్ఫారు. దీంతో హత్యకు ప్లాన్ చేసిన రమేశ్‌ తన

స్నేహితుడైన ఇప్పల శేఖర్‌‌‌కు ప్లాన్ గురించి వివరించాడు..తర్వాత ఇద్దరూ కలిసి రోజాగా మారిన వెంకటేష్‌కు మధ్యం తాగించారు. అనంతరం మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి వెంటకటేష్‌కు హతమార్చారు. అనంతరం పోలీసులు

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తర్వాత పోస్ట్‌మార్టమ్ నిర్వహించగా అది హత్యగా నిర్ధారణ అయింది. దీంతో సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీసులు దర్యాప్తు జరిపి హత్య కేసులో నిందితులుగా ఉన్న వేదశ్రీతో పాటు మరో అయిదుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో వేదశ్రీ, బోయిని రమేశ్‌, ఇప్పల శేఖర్‌లను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చెపట్టారు.

Updated : 7 Jan 2024 2:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top