Home > తెలంగాణ > తెలంగాణలో ఏ ఊరు చూసినా ధరణి గోసలే కన్పిస్తున్నాయ్ : షర్మిల

తెలంగాణలో ఏ ఊరు చూసినా ధరణి గోసలే కన్పిస్తున్నాయ్ : షర్మిల

తెలంగాణలో ఏ ఊరు చూసినా ధరణి గోసలే కన్పిస్తున్నాయ్ : షర్మిల
X

బీఆర్ఎస్ సర్కార్ పై వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమైతుందన్నారు. స్వయానా ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువొచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగని వ్యాఖ్యానించారు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్లు మార్చి చూపించే మాయాజాలమే ధరణి అంటూ విమర్శలు గుప్పించారు.

గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్లు రాష్ట్రంలో ఏ ఊరు చూసినా ధరణి గోసలే కన్పిస్తున్నాయని షర్మిల తెలిపారు. తహశీల్దార్ దగ్గర నుంచి కోర్టుల దాకా ధరణి బాధలే ఉన్నాయన్నారు. రైతుల భూములను గుంజుకొని, కోర్టుల చుట్టూ తిప్పుతూ, ధరణే ధైర్యం అని చెప్పడానికి దొరకు ఆయన బందిపోట్లకు సిగ్గుండాలే అని మండిపడ్డారు. భూ వివాదాల కోసం కాదు.. ముమ్మాటికి దొర భూదోపిడీ కోసమే తెచ్చుకున్న పథకం అని ఆరోపించారు. ‘‘ ధరణి బందిపోట్ల ఆస్తుల్ని పెంచడానికి అమలు చేసిన పథకం. ధరణి తిప్పలు తప్పాల్నంటే దొర నియంత పాలనను బొంద పెట్టుడు ఒక్కటే మార్గం. ఈ ఎన్నికల్లో కారుకు కర్రు కాల్చి వాత పెట్టుడు ఒక్కటే పరిష్కారం’’ అని షర్మిల పిలుపునిచ్చారు.

Updated : 11 Nov 2023 2:58 PM GMT
Tags:    
Next Story
Share it
Top